TG: మంత్రివర్గ విస్తరణ గురించి మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు. విద్యాశాఖ నా పరిధిలోనే ఉంది. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేదు. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తన పార్టీలో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తులేదా?' అని రేవంత్ ప్రశ్నించారు.