ప్రధాని నరేంద్ర మోదీ నేడు దేశవ్యాప్తంగా 553 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, 1500 రైల్ ఓవర్ బ్రిడ్జిలు, 1500 అండర్ పాస్లను జాతికి అంకితమివ్వనున్నారు. అమృత భారత్ స్టేషన్స్ స్కీమ్లో భాగంగా ఫేజ్ 2లో కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తోంది. తెలంగాణలో 15, ఏపీలో 34 ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అభివృద్ధి పనులకు రూ.41 వేల కోట్లు కేటాయించారు.