ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రాక్టర్-ట్రాలీని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం పోలీసులు, స్థానికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.