యూపీ అయోధ్యలోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వేపై ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై ఎదురుగా వెళ్తున్న ట్రక్కును ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళ, ఆమె కుమార్తె, కోడలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.