ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు: భట్టి

24670చూసినవారు
ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు: భట్టి
అకాల వర్షాలతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. తడిచిన ధాన్యం కూడా కొంటున్నామన్నారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని.. వాతావరణ శాఖ సూచనలను రైతులకు అందించాలని సూచించారు.