జమ్మూ, పంజాబ్లలో పాకిస్థాన్ సరిహద్దు వెంబడి చెక్పోస్టుల వద్ద అదనపు సిబ్బందిని మోహరించాలని బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. చొరబాట్లను అరికట్టడంతోపాటు ఆయుధాలు, మాదకద్రవ్యాలను మోసుకొచ్చే డ్రోన్లను నిలువరించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా జమ్మూకాశ్మీర్ నుండి గుజరాత్ వరకు ఉన్న 2,289 కిలోమీటర్ల పొడవైన భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దును కాపాడే బాధ్యత BSFదే.