’పూరీ‘లో ఉదయమే ప్రత్యేక పూజలు

55చూసినవారు
’పూరీ‘లో ఉదయమే ప్రత్యేక పూజలు
రత్న భాండాగారం తెరవనున్న నేపథ్యంలో శ్రీక్షేత్రంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండిచా మందిరానికి వెళ్లి జగన్నాథుడి అనుమతి తీసుకున్నారు. అనంతరం లోకనాథ ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అక్కడ ఆజ్ఞమాల (పూలమాల) తీసుకుని శ్రీచక్రం (ఖజానా గది) వద్దకు చేరుకున్నారు. అంతకుముందు శ్రీచక్రానికి రక్షగా ఉన్న విమలాదేవి, మహాలక్ష్మి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ఆ తల్లుల అనుమతితో రత్న భాండాగారం తెరిచారు.

సంబంధిత పోస్ట్