తల్లిని కొడుతున్నాడని తండ్రిని చంపిన బాలుడు

64చూసినవారు
తల్లిని కొడుతున్నాడని తండ్రిని చంపిన బాలుడు
ఢిల్లీలోని రోహిణిలో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తరుచూ మద్యం మత్తులో భార్య, పిల్లలను కొడుతూ చిత్రహింసలు పెట్టేవాడు. అయితే తండ్రి తాజాగా మద్యం తాగి ఇంటికి వచ్చాక భార్యను కొట్టాడు. దీంతో 16 ఏళ్ళ బాలుడు ఆవేశంతో తలపై రాడ్డుతో కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని బాలుడిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్