కాంగ్రెస్ లోకి ఎంపీ కేకే: దానం నాగేందర్

181382చూసినవారు
కాంగ్రెస్ లోకి ఎంపీ కేకే: దానం నాగేందర్
జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు ఎంపీ కే.కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. దానంతో మేయర్ విజయలక్ష్మి నేడు భేటీ అయ్యారు. అనంతరం దానం మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ గుర్తుపై గెలిచానని.. తనపై సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు బీఆర్ఎస్ నేతలకు ఉందని చెప్పారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచాక.. తానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.