బిల్డర్ మధు హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

75చూసినవారు
బిల్డర్ మధు హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు
హైదరాబాద్ లో బిల్డర్ మధు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో కుప్పాల మధు(48)కు కెసినోలో రేణుకా ప్రసాద్, నిఖిత్, సిద్ధార్థ్ రెడ్డి, వరుణ్ గ్యాంగ్ పరిచయమైంది. రేణుకా ప్రసాద్ మధు కూతురుని ప్రేమలోకి దింపి పెళ్లి చేయాలని కోరాడు. దీనికి నిరాకరించిన మధుపై కక్ష పెంచుకుని.. కెసినో ఆడుదామని బీదర్ తీసుకెళ్లి మధును బండరాయితో కొట్టి.. కత్తులతో పొడిచి హత్య చేశారు. మధు ఒంటిపై ఉన్న బంగారం, రూ.5 లక్షలు నగదు తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.