అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చెన్నై వేదికగా గురువారం జరిగిన ‘తండేల్’ ఈవెంట్లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. ‘ఇలాంటి సినిమాను నాపై నమ్మకంతో చేసినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. సాయిపల్లవి ప్రతిఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని, అందుకే అందరూ ఆమెను ప్రేమిస్తుంటారు. ఆమెతో వర్క్ చేయాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది’ అని చెప్పారు.