AP: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా 2 బస్సుల్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల 11న తిరుపతి, 12న నెల్లూరు నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయి. తిరుపతి బస్సు కడప, కర్నూలు, హైదరాబాద్ మీదుగా కుంభమేళాకు వెళ్తుంది. తిరిగి 18న తిరుపతికి చేరుకుంటుంది. నెల్లూరు బస్సు.. విజయవాడ, రాజమహేంద్రవరం, వైజాగ్ మీదుగా వెళ్లి.. 19న రిటర్న్ అవుతుంది.