ప్రభుత్వబడులను ఆదరించాలి: ఎమ్మెల్యే

66చూసినవారు
ప్రభుత్వబడులను ఆదరించాలి: ఎమ్మెల్యే
ప్రభుత్వబడులను ప్రజలు విద్యార్థులు ఆదరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మా రెడ్డి కోరారు. శనివారం మిర్యాలగూడలో బడిబాట ప్రచారకార్యక్రమం ప్రారంభించడంతో పాటు విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణి చేసి మాట్లాడారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన ఉచితవిద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందన్నారు. అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలికవసతులు కల్పించిందని, అమ్మ కమిటీలు ఉపాధ్యాయులు విద్యార్థులను పెద్ద సంఖ్యలో చేర్చి వారి భవిష్యత్ తీర్చి దిద్దాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :