రక్తదానం చేసిన జప్తివీరప్పగూడెం వాసి

61చూసినవారు
రక్తదానం చేసిన జప్తివీరప్పగూడెం వాసి
మిర్యాలగూడ మండల కేంద్రంలోని జ్యోతి ఆసుపత్రిలో ఓ మహిళకు ఓ పాజిటివ్ రక్తం అత్యవసరమని పేషంట్ కుటుంబ సభ్యులు మేధ ఫౌండేషన్ వారిని సంప్రదించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు పిన్నం వేణు సమాచారం చేరవేయడంతో వారి బంధువైన జప్తివీరప్పగూడెం వాసి, మేధ ఫౌండేషన్ సభ్యులు బైరోజు సతీష్ వెళ్లి రక్తదానం చేశారు. ఆ సమయానికి అక్కడే ఉన్న ఫ్రెండ్స్, వేదశ్రీ అయుష్మాన్ భవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నవీన్, విజయ్ సతీష్ ని అభినందించారు.

సంబంధిత పోస్ట్