కారు- బైక్ ఢీకొని యువకుడి మృతి
నారాయణపే జిల్లాలో కారు- బైక్ ఢీకొని యువకుడి మృతి చెందిన ఘటన నర్వ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో నర్వ నుండి వెళ్తున్న కారు అమర్చింత నుండి వస్తున్న బైక్ను అతివేగంగా ఢీకొనడంతో బైక్పై వెళుతున్న యువకుడు ఎగిరిపడి, తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. కాగా మృతుడు మక్తల్ మండలం మంతన్గోడ్ గ్రామానికి చెందిన శివగా గుర్తించారు.