రణరంగంగా మారిన గుంటూరు జిల్లా (వీడియో)

50936చూసినవారు
ఏపీలో ఎన్నికలు ముగిసినా దాడులు ఆగడం లేదు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కారంపూడి ప్రాంతం రణరంగంగా మారింది. ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్లపై కర్రలు చేత పట్టుకుని విధ్వంసం సృష్టించారు. అది చూసిన స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్