ఎన్డీఏకు 400 సీట్లు రాబోతున్నాయి: ప్రధాని మోదీ

84చూసినవారు
ఎన్డీఏకు 400 సీట్లు రాబోతున్నాయి: ప్రధాని మోదీ
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు దాటవని, మోదీ పీఎం కాలేరన్న రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘నేను ఆ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను. దీనిపై చర్చ అవసరమే. బహుశా రాహుల్‌ ఎన్డీఏకు 399 లేదా 398 వస్తాయనుకుంటున్నాడేమో. అతడికి 400 ప్రామాణికం అనుకుంటా’ అని పేర్కొన్నారు.