పెట్రోల్ రేట్లు పెరిగిపోతుండడంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో గ్రీవ్స్ కంపెనీ కొత్త ఆంపియర్ రియో 80 EV స్కూటర్ను భారతీయ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ఫీచర్లను పరిశీలిస్తే.. కలర్ LCD క్లస్టర్, LFP బ్యాటరీ, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 80 కి.మీ.ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్ట వేగం గంటకు 25 కి.మీ ఉంటుంది. ధర రూ.59,000గా ఉంది.