కేరళలో నిఫా వైరస్ ఓ బాలుడిని బలి తీసుకున్నది. మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైరస్ సోకిన బాలుడిని వెంటిలెటర్పై ఉంచి చికిత్స అందిస్తుండగా గుండెపోటు రావడంతో కన్నుమూసినట్లుగా సమాచారం. వైరస్ సోకిందని గుర్తించిన కొద్ది గంటల్లోనే.. బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలో నిపా వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది.