రుణమాఫీ పేరిట రైతులను మోసం చేస్తోంది

61చూసినవారు
రుణమాఫీ పేరిట రైతులను మోసం చేస్తోంది
పాక్షిక రుణమాఫీ చేసి రైతులను మోసం చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు గురువారం ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అక్కడే ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్