నాలుగు రోజులు జర పైలం

50చూసినవారు
నాలుగు రోజులు జర పైలం
ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు నాలుగు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సోమవారం అధికారులు మాట్లాడుతూ పలు మండలాల్లో రాబోయే 4 రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు 41 నుండి 43 డిగ్రీల మధ్య నమోదయి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు వెళ్ళవద్దని అధికారులు కోరారు. తప్పనిసరి అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

ట్యాగ్స్ :