ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

70చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం గ్రామ మాజీ ఉపసర్పంచ్ జంగం రవి కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ జన్నారం మండలంలో పది రోజులపాటు భారీ వర్షాలు పడ్డాయని, ఇళ్ల చుట్టూ నీరు నిలువ ఉండే పరిస్థితి ఉందన్నారు. నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులై ఇళ్ల పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్