ప్రతి గింజను కొనేలా చర్యలు: ఎమ్మెల్యే

77చూసినవారు
ప్రతి గింజను కొనేలా చర్యలు: ఎమ్మెల్యే
రైతుల నుండి ప్రతి ధాన్యం గింజను కొనేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, మండల అధ్యక్షులు దొనికేని దయానంద్, జనరల్ సెక్రెటరీ షబ్బీర్ పాషా, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్