ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజం: ఎఎస్పీ

64చూసినవారు
ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజం: ఎఎస్పీ
వృత్తిలో ఉన్నంత వరకు మనం చేసిన సేవలు చిరకాలంగా గుర్తుంటాయని ఎఎస్పీ కాంతిలాల్ పటేల్ అన్నారు. మంగళవారం భైంసా పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పి. అమోస్ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వృత్తి ఎంతో విలువైనదని, వృత్తికి న్యాయం చేసేందుకు నడుం బిగించాలని కోరారు. ఈరోజు పదవీ విరమణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్ సేవా కాలంలో తన వృత్తికి ఎంతో న్యాయం చేశారన్నారు. అనంతరం ఆయన దంపతులను ఘనంగా సన్మానించారు.