ముథోల్ లో మహాదేవ్ కట్టె ప్రతిష్టాపన

70చూసినవారు
ముథోల్ మండల కేంద్రలోని శ్రీ పశుపతినాథ్ శివాలయ ధ్వజస్తంభం ముందర శుక్రవారం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహాదేవ్ కట్టెను ప్రతిష్టించారు. ముథోల్ లోని ఆయా సంఘం ఆధ్వర్యంలో మహాదేవ్ కట్టెను శనివారం రాత్రి ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి తహసిల్ కార్యాలయం ముందర గల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. మహోత్సవానికి గ్రామస్తులందరూ హాజరు కావాలని కోరారు.

ట్యాగ్స్ :