కాంగ్రెస్ గాలికి నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. సోన్ మండలానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు గురువారం ఆ పార్టీకి రాజీనామా హస్తం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయఢంకా మోగించేలా పని చేయాలని పిలుపునిచ్చారు.