డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావును కలిసిన ఎంపీ అభ్యర్థి

542చూసినవారు
డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావును కలిసిన ఎంపీ అభ్యర్థి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని సుగుణ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావును శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా సుగుణను ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోసం కష్టపడి పనిచేసి గెలిపించుకుంటామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్