నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవరకోట ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించి, మహిళలు మంగళహారతులు బాజా భజంత్రీల నడుమ పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు చేపట్టారు. ఇందులో ఇన్చార్జి ఈఓ రవి కిషన్, చైర్మన్ అమెడ శ్రీధర్, ధర్మకర్తలు పాల్గొన్నారు.