గురువారం రెంజర్లకు రైతు ఉద్యమకారుడు రాక
బాల్కొండ మండలం రెంజర్ల గ్రామానికి గురువారం ప్రముఖ రైతు ఉద్యమకారుడు కిసాన్ సేతు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర విత్తనోత్పత్తి చైర్మన్ అన్వేష్ రెడ్డి పర్యటించనున్నారని గ్రామ కాంగ్రెస్ రైతు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగానిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఉదయం 8 గంటలకు రెంజర్ల గ్రామానికి వస్తున్నట్లు గ్రామ కాంగ్రెస్ రైతు నాయకులు తెలిపారు. రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.