కమ్మర్ పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామంలో శ్రీ అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టలో భాగంగా ప్రత్యేక పూజలను సోమవారం నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన ప్రసాదం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సక్కారం అశోక్, గంగాధర్, కృష్ణ పంతులు, ఏనుగు గంగా రెడ్డి, కతర్ గంగాధర్, సధర్, అల్లకొండ గంగాధర్, గోపు నవీన్, నారాయణ, బందేల రాజు, జప శేఖర్, రఘు, తదితరులు పాల్గొన్నారు.