గోదావరి నదిలో వ్యక్తి మృతదేహం

16670చూసినవారు
గోదావరి నదిలో వ్యక్తి మృతదేహం
నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాసర గోదావరి నదిలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బాసర బ్రిడ్జి కింద 4, 5 పిల్లర్ల మధ్య నదిలో మృతదేహం తేలియాడుతుండగా గుర్తించిన స్థానికులు నవీపేట్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ప్రమాదవశాత్తు మృతిచెందాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్