కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నివాసముండే మహమ్మద్ బహుదూర్ ఖాన్ అలియాస్ బాబా అనే వ్యక్తి ఈనెల 19న డ్రైవింగ్ పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం తెలిపారు. అతని భార్య నూర్జహాన్ అతని ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసిన కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.