May 17, 2024, 03:05 IST/బోధన్
బోధన్
అధికారుల కనుసన్నల్లో ఇసుక అక్రమ రవాణా
May 17, 2024, 03:05 IST
సాలురా మండలం మంజీర ప్రాంతమైన హుంస, మంధర్నా, ఖాజాపూర్ గ్రామ శివారుల నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఇసుక మాఫియా దారులు ఆటోలలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సాలురా మీదుగా బోధన్ కు తరలిస్తున్నారు. ఆటోల అతి వేగానికి వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు అంతేకాక ఆటోలకు ఎలాంటి నెంబర్ ప్లేట్లు లేకపోవడం గమనార్హం.