శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. గూనపాలెంలో ఇంటిపై నిద్రిస్తున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. మృతుడు సురేష్గా పోలీసులు గుర్తించారు. సురేష్ మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.