రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

81చూసినవారు
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే స్టేషన్ ఎస్ఐ సాయి రెడ్డి తెలియజేశారు. ఎస్సై కథనం ప్రకారం రైల్వే స్టేషన్ గూడ్స్ పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుని చేతిపై ఆర్ఆర్ఆర్ అనే పచ్చ బొట్టు ఉందని, అతని వివరాలు తెలిస్తే 8712658591 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్