నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను మంగళవారం నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మే 13 న చేపట్టనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ పాల్గొన్నారు.