పీజీ మెడికల్ కాలేజీల ప్రవేశాల్లో జరుగుతున్న అక్రమాల నియంత్రణకు జాతీయ వైద్య కమిషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రతీ కళాశాల ప్రతి కోర్సుకు ముందుగానే ఫీజులను ప్రకటించాల్సి ఉంటుంది. ఏ కళాశాల కూడా సొంతంగా అభ్యర్థులను జాయిన్ చేసుకోవడం కుదరదని జాతీయ వైద్య కమిషన్ స్పష్టం చేసింది.