75 ఏళ్ల వయస్సు తర్వాత మోదీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అగ్ర నేత అమిత్ షా స్పందించారు. బీజేపీ రాజ్యాంగంలో 75 ఏళ్ల రిటైర్ అవ్వాలనే నిబంధన ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. మోదీనే తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని, భవిష్యత్తులోనూ దేశాన్ని నడిపిస్తారని, ఇందులో గందరగోళం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.