సముద్రంలో వేటకు వెళ్లిన బోటులో మంటలు (వీడియో)

74చూసినవారు
విశాఖలో పెను ప్రమాదం తప్పింది. సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఇంజిన్‌లో ఏర్పడిన మంటలు బోటు మొత్తం వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. బోటులో 5 మంది మత్స్యకారులు ఉన్నారు. పక్కనే మరో ఫిషింగ్ బోటు ఉండటంతో వారు సముద్రంలో దూకి తప్పించుకున్నారు. సుమారు రూ.40 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్