భారత్, మాల్దీవుల మధ్య అపార్థాలు తొలగిపోయాయి: మాల్దీవుల విదేశాంగ మంత్రి

77చూసినవారు
భారత్, మాల్దీవుల మధ్య అపార్థాలు తొలగిపోయాయి: మాల్దీవుల విదేశాంగ మంత్రి
భారత్, మాల్దీవుల మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోయాయని మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ తెలిపారు. మా ప్రభుత్వ ప్రారంభంలో భారత్ తో కొన్ని కఠినమైన విభేదాలున్నప్పటికీ, చైనా, భారత్ రెండు దేశాలతోనూ మేం మంచి సంబంధాలు కలిగి ఉన్నామని చెప్పారు. ఈ రెండు దేశాలు మాల్దీవులకు మద్దతిస్తున్నాయని ఆయన అన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తమ దేశం నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని వ్యాఖ్యలు చేయడంతో భారత్ తో సంబంధాలు క్షీణించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్