పార్లమెంట్లో బీజేపీ ఉన్నంతవరకూ రిజర్వేషన్లను ఏ ఒక్కరూ టచ్ చేయలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రధాని మోదీ మరోసారి పగ్గాలు చేపడితే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని అన్నారు. కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం సాగిస్తోందని దుయ్యబట్టారు.