మన దేశం అండర్-19 ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వకపోవడానికి ప్రత్యేకించి ఎలాంటి కారణం లేదని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పాడు. క్రికెట్ను ప్రపంచంలోని నలుమూలలకు తీసుకువెళ్లడమే ఈ టోర్నీ ప్రధాన ఉద్దేశమని చెప్పాడు. ’’సీనియర్ పురుషుల జట్లు పాల్గొనని చాలా ప్రపంచకప్లు లాభాపేక్ష లేనివని, త్వరలోనే ఈ టోర్నికి భారత్ ఆతిథ్యం ఇవ్వొచ్చునని‘‘ గంగూలీ అభిప్రాయపడ్డాడు.