ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం మహిళలపై నేరాలలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రతి గంటకు 8 మంది మహిళలు వేధింపులకు గురవుతున్నారని వాపోయారు. రాష్ట్రంలో మహిళ న్యాయమూర్తికే రక్షణ లేకపోతే.. సాధారణ మహిళలకు రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు. న్యాయమూర్తి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.