సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన రుణమాఫీ కాని రైతులు

79చూసినవారు
తెలంగాణలోని సిద్థిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని రైతులు జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టర్ ఆఫీస్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన రైతులను బయటే ఉంచి, కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు. తక్షణమే రుణమాఫీ చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్