ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా మార్కెట్ విలువలో యాపిల్ను దాటేసింది. బుధవారం సంస్థ షేర్లు దూసుకెళ్లడంతో మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆ సంస్థ అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రెండో స్థానానికి చేరింది. స్టాక్స్ను మరింత విభజించేందుకు ఎన్విడియా సిద్ధమవుతున్న నేపథ్యంలో షేర్లు దూసుకెళ్లాయి. కాగా అగ్రస్థానంలో మైక్రోసాఫ్ట్ (3.14 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతోంది.