వృద్ధుడిని నిప్పుల్లోకి తోసేశారు (వీడియో)

192755చూసినవారు
ముంబై నగరానికి సమీపంలోని ముర్బాద్ తాలూకా కర్వాలే గ్రామంలో బుధవారం అమానవీయ ఘటన జరిగింది. లక్ష్మణ్ బందు భావార్థే (75) క్షుద్రపూజలు చేస్తున్నాడని గ్రామస్థులు అనుమానించారు. తెల్లవారుజామున 2.30 గంటలకు అతడిని నిప్పుల్లో నిలబెట్టారు. కాళ్లు కాలుతుండడంతో ఆ వృద్ధుడు బాధతో కేకలు పెట్టాడు. మరోవైపు శరీరంపై వాతలు వచ్చేలా అతడిని కొట్టారు. వృద్ధుడి అరికాళ్లు రెండూ తీవ్రంగా కాలిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్