పాక్ అమ్మాయి, భారత్ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి

63చూసినవారు
పాక్ అమ్మాయి, భారత్ అబ్బాయి.. ఆన్‌లైన్‌లో పెళ్లి
పాక్ అమ్మాయికి, భారత్ అబ్బాయికి ఆన్‌లైన్‌లో ఘనంగా వివాహం జరిగింది. యూపీలోని జౌన్‌పూర్ జిల్లాకు చెందిన BJP నేత, కౌన్సిలర్‌ అయిన తహసీన్ షాహిద్ తన కొడుకు మహ్మద్ అబ్బాస్ హైదర్‌కు, పాక్‌లోని లాహోర్‌కు చెందిన యువతి అందాలిప్ జహ్రాతో శుక్రవారం పెళ్లి జరిపించాడు. ఇరు కుటుంబ సభ్యులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నా దక్కలేదు. దానికి తోడు వధువు తల్లి యాస్మిన్ జైదీ అనారోగ్యంతో ఐసీయులో చేరడంతో ఈ పెళ్లి వేడుకను ఆన్‌లైన్‌లో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్