తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయించుకున్నారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 'మోదీ అభివృద్ధి కార్యక్రమాలు చూసే వారు నాకు ఓటేశారు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలు పేదలకు అందుతున్నాయి. మా కార్యకర్తలను చాలామంది బెదిరించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు' అని అన్నారు.