ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టులో పిటిషన్

57చూసినవారు
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై హైకోర్టులో పిటిషన్
ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే దానంపై వేటు వేయాలని బీఆర్ఎస్ అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. తాజాగా రాజు యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.