మహారాష్ట్రలోని జల్గావ్ ఎయిర్పోర్టులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్కు తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో రన్వేపై ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్ జారిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. అందులో ఉన్న పైలట్ సురక్షితంగా బయట పడ్డాడు. అయితే ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్కు స్వల్పంగా దెబ్బతింది. దీనిపై ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు జిల్లా యంత్రాంగం నివేదించింది.